పెళ్లి చేసుకుంటాన‌ని ఆయ‌న మోసం చేశాడు

టాలీవుడ్ ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కె నాయుడు వివాదంలో చిక్కుకున్నాడు. సినీ ఆర్టిస్ట్ సాయి సుధా అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని ఆయ‌న‌పై ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సుధా ఫిర్యాదు ప్ర‌కారం కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌ని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. శ్యామ్ కె నాయుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పనిచేశారు. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు.