జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం

జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వెల్లడించారు. వీరంతా ముంబై నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. జగిత్యాల కృష్ణానగర్‌కు చెందిన ఒకరు, గొల్లపల్లి మండలం చందోలి గ్రామానికి చెందిన ముగ్గురు.. భీముడి దిబ్బ గ్రామానికి చెందిన ఇద్దరు.. బుగ్గారం మండలానికి చెందిన ఇద్దరు కరోనా బారిన పడినట్టు తేలింది.