భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

దేవుడికి చేసిన సేవ తిరిగి మనకు ఎదో ఒక రూపంలో మళ్ళీ ఇస్తాడని ఘట్కేసర్ భజరంగ్ దళ్ సభ్యులు అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో దాదాపు 600 మందికి పైగా అన్నదానం చేశారు. అలాగే 200 నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. మరోవైపు దాదాపు 60 మంది యువకులు రక్తదానం చేశారు. కరోనా లాక్ డౌన్ వల్ల వలస కూలీలు ఇబ్బంది పడకుండా ప్రతి రోజు వివిధ ప్రాంతాల్లో అన్నదానం, సరుకుల పంపిణి చేస్తున్నట్లు భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు.