తెలంగాణలో ఆగని కరోనా కేసులు : 1414

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 1,414కు చేరుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 40 కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా నుంచి కోలుకుని గురువారం 13 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.