యాంకర్ గా : కీర్తి రెడ్డి

రిపోర్టర్ గా ప్రస్థానము ప్రారంభించి యాంకర్ గా మారింది తెలంగాణ ముద్దు బిడ్డ కీర్తి రెడ్డి. ఎన్నో ఖండాలు దాటి తెలంగాణ యాసా, భాష వినిపించనుంది హైదరాబాద్ ఆడపడుచు. తెలుగు భాష గొప్పదాన్ని అమెరికాలో వినిపించనుంది. కరోనా లాక్ డౌన్ ఉన్న ఆమె మాటలు మాత్రం అమెరికాలో మారుమోగనున్నాయి. యూఎస్ లోని అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ అనే సంగీత కార్యక్రమానికి కీర్తి రెడ్డి యాంకర్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం మే 14గురువారం రాత్రి 9.30 నుండి లైవ్ ని ఫేస్ బుక్, యూట్యూబ్ తో పాటు కొన్ని న్యూస్ చానెళ్లు ప్రసారం చేయనున్నాయి.