భారత్‌లో 60వేలకు చేరువైన కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గత 24 గంటల్లో మరో 95 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,981కి చేరింది. మరో 3,320 మంది కొత్తగా వైరస్ బారినపడడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 59,662కు పెరిగింది. వీరిలో 17,847 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 39,834 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.91శాతంగా ఉన్నట్లు అధికారిక సమాచారం.