పోలీసు సంక్షేమానికి విరుష్క దంపతుల విరాళం

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ముంబయి పోలీస్‌ సంక్షేమానికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మ విరాళం అందజేశారు. ఒక్కొక్కరు రూ.5లక్షల చొప్పున ఇచ్చినట్టు ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌   వెల్లడించారు.  కరోనాపై యుద్ధంలో ముందుండి పనిచేస్తున్న పోలీసుల సంక్షేమానికి విరాళం ఇచ్చినందుకు ఈ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.