దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల

భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్. దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు, 103 మంది మృతి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342.

ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 16,539 మంది డిశ్చార్జి కాగా, 1,886 మృతిచెందినట్టుగా వెల్లడి . ప్రస్తుతం దేశంలో 37,916 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడి. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలోనే .

ఈ మూడు చోట్ల దాదాపు 31వేల కరోనా కేసులు నమోదు. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కరోనా కేసులు నమోదు కాగా, 694 మంది మృతి.

గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, రాజస్తాన్‌ 3,427, మధ్యప్రదేశ్‌ 3,252, ఉత్తరప్రదేశ్‌లో 3,071 కరోనా కేసులు నమోదు