తెలంగాణలో వైన్ షాపులు ఓపెన్

తెలంగాణలో మద్యం షాపులు తెరబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల కారణంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలుపెట్టాయన్న సీఎం కేసీఆర్… సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారని అన్నారు. దీంతో తెలంగాణ మద్యం ధరలు పెంచకతప్పని పరిస్థితి నెలకొందని కేసీఆర్ అన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం పెంచబోతున్నామని… మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని అన్నారు. వైన్ షాపుల దగ్గర భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని… మాస్కులు ఉంటేనే షాపు యజమానులు మద్యం అమ్ముతారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.