బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. మార్చి 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బండి సంజయ్‌ని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత పార్టీ కార్యాలయానికి అనేక సార్లు వచ్చినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్‌, ధర్మపురి అర్వింద్‌, మోత్కుపల్లి నరసింహులు తదిరుల సమక్షంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ మీడియాతో మట్లాడారు. ‘ఈ రోజు బాధ్యతలు తీసుకున్నా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. మార్చి 20 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. కేంద్ర సూచనలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాయి. దేశ ప్రజల ఐక్యతకు ఇది స్పూర్తి. కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు సహకరించాము. భవిష్యత్‌లో కూడా సహకరిస్తాము. వైద్యం, లాక్ డౌన్ అమలుకు సేవ చేయడానికి బీజేపీ కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు.