కిమ్స్ సవీర నుండి ముగ్గురి కరోనా భాదితుల డిశ్చార్జ్

అనంతపురం పట్టణంలోని కిమ్స్ సవీర ఆసుపత్రి నుండి రోజు రోజుకు కరోనా భాదితులు డిశ్చార్జ్ అవుతున్నారు. గత కొన్ని రోజులగా కిమ్స్ సవీరలో చికిత్స పొందుతున్న ముగ్గురు ఇవాళ సాయంత్ర్రం డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఆసుపత్రి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు.
జిల్లాలోని హిందూపురంకి చెందిన వారికీ కరోనా వ్యాధి సోకడంతో వారిని ఈ నెల 15వ తేదీన ఇక్కడ అడ్మిట్ చేసారని…నాటి నుండి వారికి ఇక్కడ వైద్య సదుపాయాలు అందిస్తున్నామని డాక్టర్ రవిశంకర్ తెలిపారు. కాగా వారు ఇప్పుడు పూర్తిగా కోలులున్నారు అని వివరించారు. కిమ్స్ సవీరలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని కోలుకున్న భాదితులు తెలిపారు. ప్రతి ఒక్కరు డాక్టర్లు చెప్పినట్టుగా వారు సూచించిన నియమాలు పాటించాలన్నారు. డిశ్చార్జ్ చేసే సమయంలో హాస్పిటల్ ఏండీ కిషోర్ రెడ్డి, డాక్టర్ ముకుంద రెడ్డి పాల్గొన్నారు. కరోనా నుండి కోలుకున్న వారికి కిమ్స్ సవీర యాజమాన్యం తరుపున అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తున్న ఈ వ్యాధిని జయించడానికి సామజిక దూరం, క్రమశిక్షణ ఎంతో అవసరమని కిమ్స్ డాక్టర్ రవి శంకర్ తెలిపారు. మరో 9 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.