ఉపాధి హామీ కూలీ పెంపు

తెలంగాణ లో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధి కూలీల వేతనం రూ. 211 నుంచి రూ. 237కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన వేతనం 2020, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. వేతనాల పెంపుపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.