సాయి ధరమ్ తేజాతో అది కావాలని గొడవ చేసిన లేడీ

సెలబ్రెటీల ఇంటి ముందు రెగ్యులర్ గా పదుల సంఖ్యలో అభిమానులు సాధారణ జనాలు గుమ్మిగూడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సార్లు అభిమానుల ఉత్సాహం కాస్త ఎక్కువ అవుతుంది. తమ అభిమాన స్టార్ ను చూడాలనే ఉద్దేశ్యంతో ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటి వద్ద అదే పరిస్థితి నెలకొంది. ఒక మహిళ నేడు తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. పదే పదే ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ వారితో వాదనకు దిగి ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడం తో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఆమెను పోలీసులు తరలించారు. విచారించిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఆమె తమిళనాడులోని మధురై కి చెందినది. ఆమె మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అటు ఇటు తిరుగుతూ ఉందట. దాంతో ఆమె కు సంబంధించిన వారికి వివరాలు తెలియజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మధురైకి చెందిన మహిళ.. సాయి ధరమ్ తేజ్ ఇంటి ముందే వెళ్లి హల్ చల్ చేయడం ఏంటో అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమా యొక్క గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది.