న‌నాక్‌రాంగూడలో జోరుగా గంజాయి విక్రయం

  • పట్టించుకోని పోలీసులు
  • గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపు దందా
  • అండ‌గా ధీరు భాయ్‌

డెక్క‌న్ న్యూస్‌, క్రైం బ్యూరో: ననాక్‌రాం గూడలో గుట్టుచప్పుడు కాకుండా జోరుగా గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానిలుకు మండిపడుతున్నారు. కిరాణం షాప్ లో గుట్టుచప్పుడు కాకుండా… మద్యం, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా భవన నిర్మాణాలు జరుతుండటంతో… అధికంగా కార్మికులు నివసిస్తున్నారు. వారిని బలహీనతను ఆసరాగా చేసుకొని మద్యం, గంజాయి విక్రయిస్తు వారి ప్రాణాలతో చేలాగాటమాడుతున్నారు. స్థానిక నేతలు ధీరుభాయ్‌, కొందరి పోలీసుల అండ ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. ఆదివారం రాత్రి ఓ టీవీ ఛానెల్ వాళ్ళు గంజాయి విక్రయాలపై స్టింగ్ ఆపరేషన్ చేశారు. గత పదిహేను రోజులుగా గమనించి.. ఆదివారంనాడు ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ సమాచారాన్ని టాస్క్ ఫోర్స్, ఎస్ ఓ టి , స్థానిక పోలీసులు తెలియజేశారు. ఈ వారంలో ననాక్‌రాంగూడ లో పోలీసుల దాడులు ఉంటాయని విశ్వసనీయ సమాచారం.