పేరు మార్చినా… జ‌నం గుండెల్లో మార్చ‌లేరు : అనిత‌

ఎన్టీఆర్ పేరు మ‌ర్చినంత మాత్ర‌నా.. జ‌నం గుండెల్లో ఆయ‌న ముద్ర‌ను చెరిపివేయ‌లేర‌ని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు అనిత వంగ‌ల‌పూడి. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఇచ్చిన ఆదేశాల మేర‌కు పాయ‌క‌రావుపేట మండంలో ఆమె రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. వైకాపా అధికారంలో వ‌చ్చిన త‌రువాత అభివృద్ధిని ప‌క్క‌న‌బెట్టి… తెలుగుదేశం పేరును చెరిపివేయాలనే కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే అన్ని ప‌థ‌కాల‌కు ఆయ‌న‌, ఆయ‌న తండ్రి పేరు పెట్టుకున్నారు. అంతేకానీ జ‌నం గుండెల్లో మాత్రం ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అలాగే ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చిప్ప‌కుడేన‌ని అన్నారు.