హైద‌రాబాద్‌లో రాహుల్ జోడో యాత్ర‌

భార‌త్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ నెల 24న ఈ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి రూట్ మ్యాప్‌ల‌ను సిద్ధం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… పోలీసుల అనుమ‌తి కోసం నేడు రాష్ట్ర డీజీపీ మ‌హేందర్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రెండు రూట్ మ్యాప్‌ల‌ను డీజీపీకి అంద‌జేశారు. వీటిలో ఒక‌దానిని పోలీసులు అనుమ‌తించ‌నున్నారు.

హైద‌రాబాద్‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి రెండు రూట్ మ్యాప్‌ల‌ను టీపీసీసీ ఖ‌రారు చేయ‌గా… అందులో చార్మినార్ నుంచి గాంధీ భ‌వ‌న్, జూబ్లీ హిల్స్ మీదుగా ప‌టాన్‌చెరు చేరుకునేలా ఓ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇక రెండో రూట్ శంషాబాద్ నుంచి రాజేంద్ర న‌గ‌ర్‌, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ (హెచ్‌సీయూ), బీహెచ్ఈఎల్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ రెంటిలో పోలీసులు దేనికి అనుమ‌తి ఇస్తార‌న్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.