కొత్త విమానం కొంటున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరిని కదిపినా.. సీఎం కేసీఆర్ ముచ్చ‌ట్టే… ఎందుకంటే ఆయ‌నతోటి అట్లుంట‌ది మ‌రీ. కొడితే కుంభ స్థ‌లాని కొట్టాలి కానీ.. ఈ ఎమ్మెల్యే, ఏంపీ, సీఎం గిదిఎందో అనుకున్నాడు ఏమో మ‌రీ. కాక చాలా దేశ రాజ‌కీయాల మీద దృష్టి పెట్టిండు. ఇక అంతే. మ‌రీ రాష్ట్రంలో అయితే హెలిక్యాప్ట‌రో.. బ‌స్సో… బండి మీద‌నో తిర‌గొచ్చు కానీ దేశం అంత మొత్తం క‌లె తిర‌గాలి అంటే గాలి మోట‌ర్ ఉండాలి మ‌రీ. అందే 80 కోట్లు పెట్టి విమానం కొంట్టుండు అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇగ అస‌లు క‌థ‌లోకి పోదాం…

తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అడుగు ముందుకేస్తున్నాడు. జాతీయ రాజకీయాలను దున్నేయాలని బయలు దేరుతున్నాడు. ఈ దసరాకు జాతీయ కమిటీతోపాటు పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక 2014లో నరేంద్రమోడీ ఎలాగైతే దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాడో అలాగే కేసీఆర్ సైతం ప్రతీ రాష్ట్రంలో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం పకడ్బందీ ప్లాన్ చేస్తున్నాడు.

జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ అదినేత కేసీఆర్.. కొత్త విమానం కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. 12 సీట్లున్న విమానానికి రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇంత భారీ మొత్తం కోసం విరాళాలు ఇచ్చేందుకు గులాబీ నేతలు పోటీపడుతున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ వద్ద కూడా ప్రస్తుతం ఏకంగా రూ.865 కోట్ల నిధులున్నాయి. వీటిని జాతీయ స్థాయిలో సభలు సమావేశాలు సహా పార్టీ సంబంధిత ఇతర ఖర్చుకు వెచ్చించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా బీజేపీకి ప్రత్యామ్మాయంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక వనరులతోపాటు అవసరాల కోసం ప్రత్యేక విమానం అవసరం కావడంతో ఈ మేరకు దాన్ని కొనుగోలుకు రెడీ అవుతున్నారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను ప్రకటించిన తర్వాత కేసీఆర్ జాతీయ దృష్టిని ఆకర్షించారు. అతని రాజకీయ ఎత్తుగడలను కూడా బిజెపి నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అన్ని కోణాల్లో కేసీఆర్ ఆయన కుటుంబంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇటీవల ఈడీ దాడులు కూడా తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.