దేశంలో ఆగ‌ని క‌రోనా మ‌ర‌ణాలు

భార‌త్ దేశ్ం‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతుల సంఖ్య ఆగ‌డం లేదు. నిత్యం వంద‌లాది మంది మ‌ర‌ణిస్తున్నారు. ఇప్ప‌టికే దేశంలో ఆరు వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 2,16,919కి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 60 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం 106737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 104107 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6075కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.
ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 2587 మంది, గుజ‌రాత్‌లో 1122 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 64,30705కు చేరుకున్న‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 385947గా ఉంది.