ధరిపల్లిలో ఘనంగా హనుమాన్ జయతి

మెదక్ జిల్లా ధరిపల్లిలో ఘనంగా హనుమాన్ జయతి ఉత్సవాలు జరిగాయి. ఉదయం గ్రామా పంచాయతీ సమీపంలోని హనుమాన్ ఆలయంలో పలువురు దేవుడికి చంద్రం పెట్టడం, ఇతర పూజా కార్యక్రమాలు చేశారు.
సాయంత్రం యువకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సామజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్బంగా కొంతమంది భక్తులు హనుమాన్ మాల విరమణ చేశారు. గత ఏడాది గ్రామంలో జరిగిన ర్యాలీ, ఇతర కార్యక్రమాలను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహిస్తామని యవకులు వెల్లడించారు.