ఓయోలో గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేస్తున్నారు

గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జ్‌ యజమానిని వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆటోనగర్‌లో మదిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40) ఓయో లాడ్జీని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తన లాడ్జ్‌లో వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గతవారం లాడ్జ్‌పై దాడి చేసి మహిళలను,విటులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాఘవేందర్‌ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.