శ్రియతో మీరు అది చేయాలంటే 200 ఇవ్వండి

క‌రోనా సంక్షోభంలో నిరుపేద‌ల‌కి అండ‌గా నిలిచేందుకు సినీ సెల‌బ్రిటీలు నడుం బిగించిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు నిత్యావ‌స‌రాలు అంద‌జేస్తున్నారు. తాజాగా శ్రియ తన వంతు సాయమందించడానికి ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారి ఆక‌లి తీర్చేందుకు ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి విరాళాలు సేక‌రిస్తుంది. @thekindnessproject.in లో కేవ‌లం రూ. 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ను మెయిల్ చేసి వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా కోరింది. మే 9 శ‌నివారం సాయంత్రం 8 గంట‌ల‌వ‌ర‌కు మీకు ఈ అవ‌కాశం ఉంది. ఆదివారం విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. లక్కీడ్రాలో విజేత‌లుగా నిలిచిన వారు (వీడియో కాల్ )లో త‌న‌తో క‌లిసి డ్యాన్స్, యోగా చేసే అవ‌కాశం పొందవ‌చ్చని పేర్కొంది. మీరిచ్చే విరాళాలన్నీ నిరుపేద‌ల‌కు చేరుతాయ‌ని, ఈ మంచి ప‌నిలో అంద‌రం భాగ‌స్వాములం అవుదాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పిలుపునిచ్చింది శ్రియ.