ఏపీ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 5943 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా..62 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1525కు పెరిగింది. ఏపీలో ఇప్పటివరకూ 441 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారిన పడి 33 మంది చనిపోయారు. ప్రస్తుతం 1051 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా కర్నూలు(25), కృష్ణా(12) జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.