వారికి తీపి కబురు చెప్పిన కేంద్రం

కరోనా లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వారికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది కేంద్ర హోంశాఖ. ఇవాళ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు, వ‌ల‌స కూలీలు, ఇత‌రులు.. త‌మ త‌మ రాష్ట్రాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చింది. అయితే ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు చేయాల‌ని, బ‌స్సుల ద్వారా చిక్కుకున్న వారిని త‌ర‌లించాల‌ని కేంద్ర హోంశాఖ ఆదేశాల్లో పేర్కొన్న‌ది. అయితే స్వంత రాష్ట్రానికి చెరుకున్న త‌ర్వాత‌.. వారంతా హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. స్థానిక అధికారులు టూరిస్టుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రిస్తార‌ని, ఒక‌వేళ వాళ్ల‌కు హాస్పిట‌ల్ క్వారెంటైన్ అవ‌స‌రం వ‌స్తే అప్పుడు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.