ప్రత్యామ్నాయం లేకనే లాక్డౌన్
- ప్రజలు ఇప్పటిలాగే సహకరించాలి
- ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
ఇప్పటివరకు చేసినట్టే ఇకపై కూడా లాక్డౌ న్ అమలుకు అందరూ సహకరించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ ఆర్ కోరారు. కరోనాను అరికట్టడానికి ఇంతకంటే వేరే మార్గంలేదని శనివారం మంత్రివర్గ సమావేశం అనంతరం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో ఒకసారే వస్తాయని, సవాళ్లను అందరం కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.











