నేడు తిరుమ‌ల‌కు సీఎం జ‌గ‌న్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తిరుమలకు రానున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అంకురార్పణ జరిగింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఏకాంతంగానే సేవలు నిర్వహించారు.. అందుకే ఈ సారి సామన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రత్యేక, బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సిఫార్సు లేఖలు కూడా అనుమంతించడం లేదు. మరోవైసు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఏపి డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి పరిశీలించారు.. ఇవాళ సాయంత్రం తిరుమాఢ వీధులతో పాటుగా ఆలయ పరిసరాలు, రింగురోడ్డును పోలీసు అధికారులతో‌ కలిసి పరిశీలించిన ఆయన భధ్రత పరమైన సలహాలు, సూచనలను అధికారులకు ఇచ్చారు..