నారా లోకేష్‌పై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని అన్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..కుప్పంకు ఎందుకు మంచినీరు కూడా ఇవ్వాలేదని ప్రశ్నించారు. గెలవలేక చంద్రబాబు దొంగ ఓట్లని ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.