ప‌క్కాగా ప్లాన్ ప‌క్క‌కు జ‌రిపారు : అనిత‌

ఏపీలో సంచ‌ల‌నంగా మారిన ఎమ్మెల్సీ కేసును ప‌క్క ప్లాన్‌తో ప‌క్క‌దోవ పట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌త్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారింద‌ని ఆరోపించారు. త‌మ పార్టీ ఎమ్మెల్సీని కాపాడుకునేందుకు కోన‌సీమ జిల్లా పేరు మార్పును తెరమీద‌కు తీసుకువ‌చ్చార‌ని విమ‌ర్శించారు. అంబేడ్క‌ర్ మీద అంత‌గా ప్రేమ ఉంటే ముందే ఎందుకు ప్ర‌క‌టించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో వైకాపా రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని అందుకే హింసాత్మ‌కంగా వ్య‌వ‌హిరిస్తున్నార‌ని మండిప‌డ్డారు.