ఎలాంటి సడలింపులు లేవు : కెసిఆర్

లాక్ డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో…. తెలంగాణాలో ఎటువంటి సడలింపు లేవు అని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు ఉన్న నియమాలే అమలవుతాయని చెప్పారు. ఆరున్నర గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, 8 వ తేదీన ఫ్రీ తెలంగాణ అవుతున్నది చెప్పారు. అయితే మే 5వ తేదీన మళ్ళీ మరోసారి మంత్రివర్గ సమావేశం ఉంటుంది అని చెప్పారు. అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం ఉంటుంది అని తెలిపారు. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. పండగలు, పార్థనలు అన్ని ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు.