మునుగోడు బ‌రిలో కూసుకుంట్లే

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చుల కోసం పార్టీ నిధుల నుంచి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. మునుగోడు అభ్యర్థిగా ఎంపికైన అనంతరం సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ఉన్నారు.