ఘ‌ట్కేస‌ర్‌లో ఘ‌నంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

ఘట్కేసర్ మున్సిపాలిటీ, గురుకుల్ కళాశాల అవరణలో శ్రీ భవానీ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేడ్చల్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, జన చైతన్య సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అబ్బాసాని యాదగిరి యాదవ్, కౌన్సిలర్ కొమ్మిడి అనురాధ రాఘవ రెడ్డి, బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, మేకల పద్మారావు, కోఆప్షన్ మెంబర్ పల్లె అరుణ, తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, తెరాస మండల వైస్ ప్రెసిడెంట్ పాలడుగు సందీప్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు విప్పర్ల హనుమాన్, ఖంది కుమార్, సారా శ్రీనివాస్ గారు మరియు అషేష్ గారు పాల్గొన్నారు. వారికి శ్రీ భవానీ నవరాత్రి ఉత్సవ సమితి నుండి కొమ్మిడి విక్రంత్ రెడ్డి, కొమ్మిడి శివ ప్రదీప్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.