ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : ఎస్పీ రోహిణి

డిసెంబ‌ర్ 31వ తేదీన ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు మెద‌క్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియ‌ద‌ర్శిని. క‌రోనా, ఓమిక్రాన్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. జిల్లా ఎస్పీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం మ‌రింత బాధ్య‌త‌ల‌ను పెంచింద‌న్నారు. ఎక్క‌డా అవినీతి జ‌రిగినా వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌న్నారు. రానున్న రోజుల్లో మెద‌క్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన జిల్లాగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా… పోలీసులు అండగా ఉంటార‌ని పేర్కొన్నారు.